Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో అర్థరాత్రి పోలీసు జులం : 4వ డివిజన్ అభ్యర్థి పీఎస్‌కు తరలింపు

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (09:57 IST)
అధికార వైకాపా పార్టీ అండతో పోలీసులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తాము చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నెల్లూరులో ఆదివారం జరుగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో 4వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త.. మామిడాల మధును అర్థరాత్రి అదుపులోకి తీసుకున్న నవాబుపేట పోలీసులు పీఎస్‌కు తరలించారు. 
 
అతని జేబులో రూ.2వేలు ఉన్నాయనే సాకుతో అక్రమంగా నిర్బంధించారని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం అందుకున్న తెదేపా నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి స్టేషన్‌కు చేరుకున్నారు. 
 
అర్థరాత్రి నుంచి ఆయన స్టేషన్‌ ఆవరణలో బైఠాయించారు. మధును విడుదల చేయకపోవడంతో కోటంరెడ్డి నిరసన కొనసాగుతోంది. 4వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి విజయం ఖాయం కావడంతో మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ప్రోద్బలంతోనే పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments