Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా నిర్మిస్తున్న ఇల్లు.. 4 రోజులు.. 9 అడుగుల లోతు.. నరబలి.. ఎక్కడ?

నెల్లూరు జిల్లాలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. 15 రోజుల క్రితం కందుకూరు నుంచి ఓ అర్థరాత్రి ఓ వ్యక్తిని తీసుకొచ్చి పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే,

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (16:31 IST)
నెల్లూరు జిల్లాలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. 15 రోజుల క్రితం కందుకూరు నుంచి ఓ అర్థరాత్రి ఓ వ్యక్తిని తీసుకొచ్చి పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, కలిగిరి మండలం తూర్పుదూబగుంట ఎస్సీ కాలనీకి చెందిన చదలవాడ మాల్యాద్రి కుటుంబం అర్థరాత్రి పూట పూజలు చేసి నరబలి ఇచ్చినట్లు స్థానికులు ఫిర్యాదులో తెలిపారు.
 
కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో ఈ తాంత్రిక పూజలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు తొమ్మిది అడుగుల లోతు గుంత తీసి ఈ పూజలు జరిపారని.. మళ్లీ గుంతను పూడ్చినట్లు గ్రామస్తులు ఫిర్యాదులో తెలిపారు. 
 
కానీ మాల్యాద్రి కుటుంబ సభ్యులు మాత్రం కుటుంబపెద్దకి అనారోగ్యంగా వుండటం వల్ల కాటికాపరి సూచనల మేరకు ఇంట్లో తొమ్మిది అడుగుల లోతు తీసి పూజలు జరిపి దానిలో గుమ్మడికాయను పూడ్చి పెట్టామని చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మాల్యాద్రి ఇంట్లో పూడ్చిన తొమ్మిది అడుగుల గుంతను తవ్వి పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments