Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పుల కలకలం...

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:04 IST)
ఈనెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. పోలింగ్ అర్ధరాత్రి వరకూ కొనసాగడం పట్ల కొన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమీషన్ వైఫల్యంగా పేర్కొన్నారు. మరికొంత మంది మరో వాదనకు తెరలేపారు. ఈవీఎంలో గుర్తు తాము నొక్కినదానికే పడుతుందో లేదో అని సందేహం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇలాంటి తరుణంలో మరోసారి కలకలం రేగింది. అదేమిటంటే నెల్లూరు జిల్లాలో వీవీప్యాట్ స్లిప్పులు బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. ఆత్మకూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వందలకొద్దీ వీవీప్యాట్ స్లిప్పులు వెలుగుచూశాయి. 
 
సుమారు 300లకు పైగా ఉన్న స్లిప్పులను ఆర్డీవో బృందం స్వాధీనం చేసుకుంది. వీవీప్యాట్ స్లిప్పులు ఎలా బయటపడ్డాయనే అంశంపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించారు. అయితే ఈ ఘటనతో రాజకీయ పార్టీలలో మళ్లీ తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments