Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గెలుపు తథ్యం... 110 నుంచి 140 సీట్లు మావే... : చంద్రబాబు

Advertiesment
Chandrababunaidu
, సోమవారం, 15 ఏప్రియల్ 2019 (14:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తంచేశారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా టీడీపీ చరిత్ర సృష్టించబోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 110 నుంచి 140 సీట్ల వరకూ టీడీపీ దక్కించుకుంటుందన్న అభిప్రాయం సర్వత్రా ఉందన్నారు. రాష్ట్రంలో టీడీపీ గెలుపు వెయ్యి శాతం విజయం తథ్యమన్నారు. 
 
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. వైసీపీ అరాచకాలను, బీజేపీ తప్పుడు పనులను ప్రజల్లో ఎండగట్టామని వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ టీడీపీపై ప్రతీరోజూ దాడులు జరిగాయనీ, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. ఏపీలో దాదాపు 8 లక్షల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీలో 30 లక్షల ఓట్లను తొలగించారన్నారు. ఫామ్ 7తో  ఏపీలోనూ భారీ సంఖ్యలో ఓట్లను తొలగించాలని కుట్ర పన్నారనీ కానీ తాము ఆరంభంలోనే మేల్కొనడంతో ఏం చేయలేక పోయారన్నారు. 
 
ఇకపోతే, తొలి దశ పోలింగ్ రోజున రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అనేక పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన ఈవీఎంలు మొరాయించాయనీ ఈ కారణంగా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారన్నారు. ఇలాంటివారిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ కూడా ఉన్నారన్నారు.  ఆ తర్వాత తన పిలుపుతో మళ్లీ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. అసలు 50 శాతం వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించడానికి ఈసీకి ఉన్న అభ్యంతరం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్‌కు సుప్రీంకోర్టు షాక్... మోడీని దొంగ అని మేమన్నామా?