Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిని కలిస్తే తప్పా? ఇనుప రాడ్‌ను కాల్చి వాతలు పెట్టిన?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫలితంగా అన్యోన్యంగా వుండాల్సి భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. ఫలితంగా వారి సంతానానికి కష్టాలు తప్పట్లేదు. తాజాగా కన్నతల్లి కఠినాత్మురాలిగా మారిపోయింది. తన కొడ

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (14:55 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫలితంగా అన్యోన్యంగా వుండాల్సి భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. ఫలితంగా వారి సంతానానికి కష్టాలు తప్పట్లేదు. తాజాగా కన్నతల్లి కఠినాత్మురాలిగా మారిపోయింది. తన కొడుకు, తండ్రిని కలుసుకున్నాడనే అక్కసుతో తల్లిని అనే విచక్షణ మరచి ఏడేళ్ల చిన్నారి శరీరంపై వాతలు పెట్టింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా సూళూరుపేట మండలం సూళ్లూరు గ్రామానికి చెందిన ప్రశాంత్, కృష్ణకుమారి దంపతులు విడివిడిగా ఉంటున్నారు. వీరికి ఓ ఏడేళ్ల బాబు ఉన్నాడు. అయితే చిన్నారి తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం చిన్నారికి తన తండ్రిని చూడాలనిపించి.. తల్లికి తెలియకుండా తండ్రిని కలుసుకున్నాడు.
 
ఈ విషయం తెలుసుకున్న కృష్ణకుమారి ఆగ్రహంతో బాలుడిని చిత్రహింసలకు గురిచేసింది. ఐరన్ రాడ్‌ను కాల్చి కొడుకు శరీరంపై వాతలు పెట్టింది. దీనిపై తండ్రి ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఆపై తల్లిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments