Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం : ఒకే గ్రామంలో 16 మందికి కరోనా

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు వైద్య సిబ్బంది, హెల్త్ వర్కర్ల నిర్లక్ష్యం కూడా ఈ వైరస్ వ్యాప్తికి ఓ కారణంగా నిలుస్తోంది. తాజాగా ఓ ఆర్ఎంపీ వైద్యుడు చేసిన నిర్లక్ష్యం వల్ల మరో 16 మందికి ఈ వైరస్ సోకింది. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లాలోని బట్లమాగుటూరు అనే గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆర్ఎంపీ వైద్యుడుగా పని చేస్తున్న ఓ వ్యక్తి ఈ గ్రామంలో అనేక మందికి వైద్యం చేస్తూ వచ్చాడు. అయితే, ఈయన వైద్యం చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గ్రామానికి వెళుతూ వచ్చేవాడు. 
 
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతూ వచ్చిన వైద్యుడికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, అది పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వైద్యం చేసిన గ్రామస్తుల వెన్నులో వణుకు మొదలైంది. చివరకు ఈ వైద్యుడు కారణంగా 16 మంది గ్రామస్తులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సెకండ్ కాంటాక్టర్‌ను గుర్తించే పనిలోపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments