Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోల ప్రతీకారం : బస్సులకు నిప్పు... కానిస్టేబుల్ కాల్చివేత

ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతికార చర్యలకు దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు, మరో ప్రైవేట్‌ సర్వీసులకు మావోలు నిప్పంటించారు.

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (10:04 IST)
ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతికార చర్యలకు దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు, మరో ప్రైవేట్‌ సర్వీసులకు మావోలు నిప్పంటించారు. హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జగ్దల్‌పూర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. సుకుమా జిల్లా దోర్నపాల్‌ కుత్తి గ్రామ సమీపంలో మావోయిస్టులు అడ్డుకుని, ప్రయాణికులను కిందకు దించేశారు. ఆ తర్వాత బస్సు డీజిల్‌ ట్యాంక్‌ను పగులగొట్టి, ఆయిల్‌ను బస్సులో చల్లి నిప్పంటించారు. 
 
అలాగే, ప్రయాణికులు చూస్తుండగానే ఒకరిని కాల్చి చంపారు. మృతుడు కానిస్టేబుల్‌గా భావిస్తున్నారు. ఇదే దారి నుంచి వెళ్తున్న మరో ప్రైవేటు బస్సు, ఒక ట్రాక్టర్‌ను కూడా దహనం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో ఈ నెల ఒకటో తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ, ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్లు సమీపంలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపునకు చేరుకున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments