అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

ఠాగూర్
మంగళవారం, 10 జూన్ 2025 (16:29 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతీ రెడ్డిలకు చెందిన సాక్షి టీవీ చానెల్ చర్చా వేదికలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాస రావు, కృష్ణంరాజులు చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 
 
రాజధాని అమరావతి కోసం చేసిన ఉద్యమంలో మహిళా రైతులది అత్యంత కీలక పాత్ర అని జాతీయ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. అలాగే, ఈ వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసి, డీజీపీకి లేఖ రాసింది. ఈ మేరకు ఎన్.సి.డబ్ల్యూ చైర్ పర్సన్ విజయ్ రహత్కర్ రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలకు ఓ లేఖ రాశారు. 
 
అమరావతి ప్రాంతంలో ఉద్యమిస్తున్న మహిళలపై జర్నలిస్టులు కృష్ణంరాజులు, కొమ్మినేని శ్రీనివాస రావులు అనుచితంగా మాట్లాడారంటూ వచ్చిన ఆరోపణలను కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు ముందుండి కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా కమిషన్ గుర్తు చేసింది. 
 
ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి వివిధ మీడియాల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని ఎన్.సి.డబ్ల్యూ ఈ అంశాన్ని సుమోటాగా విచారణకు స్వీకరించినట్టు సమాచారం. జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీశ్ గుప్తాను మహిళా కమిషన్ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments