Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌మ్య కేసు విచార‌ణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (10:28 IST)
గుంటూరులో బిటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసులో నిజ‌నిర్ధార‌ణ‌కు జాతీయ ఎస్సి కమిషన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చేరింది. గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న జాతీయ ఎస్సి కమిషన్ బృందానికి భాజపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

ఎస్సీ కమిషన్ బృందంలో వైస్ చైర్మన్ అర్జున్ హల్ధార్, మెంబెర్స్ డాక్టర్ అంజుబాల, సుభాష్ రంగ‌నాథ్, భాజపా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు, సరణాల మాలతి రాణి, ఎస్సి మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్, మహిళా మోర్చా అధ్యక్షురాలు, నిర్మలా కిషోర్ పలువురు దళిత నాయకులు ఉన్నారు.

వీరంతా గుంటూరులో ర‌మ్య హ‌త్య‌పై నిశిత ప‌రిశీల‌న చేస్తారు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి, వారి నుంచి సంఘ‌ట‌న వివ‌రాల‌ను అడిగి తెలుసుకుంటారు. ర‌మ్య హ‌త్య‌పై ఏపీ ప్ర‌భుత్వం వెనువెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో ఆ కుటుంబానికి ఇప్ప‌టికే కొంత ఊర‌ట ల‌భించింది. నిందితుడు స‌త్య కృష్ణ‌ను వెంట‌నే అరెస్ట్ చేసి, రిమాండుకు త‌ర‌లించారు. అయితే, ఈ కేసులో ఏదైనా లొసుగులు ఉన్నాయా? అనే కోణంలో జాతీయ ఎస్సీ క‌మిష‌న్ విచార‌ణ జ‌ర‌ప‌నుంది. అలాగే, క‌మిష‌న్ స‌భ్యులు, ఏపీ డీజీపిని, ఏపీ హోం మంత్రిని కూడా క‌లిసే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments