Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్య హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్ష: ఎస్.సి. క‌మిష‌న్

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (14:45 IST)
గుంటూరులో బిటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసులో నిందితుడికి క‌ఠిన శిక్ష పడేలా చూస్తామని జాతీయ ఎస్.సి. క‌మిష‌న్ ఉపాధ్య‌క్షుడు అరుణ్ హాల్ దేర్ చెప్పారు.

గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ బృందం పర్యటించింది. రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని ఎస్సీ కమిషన్ బృందం నిశితంగా పరిశీలించింది. కొద్దిసేపు రమ్య కుటుంబ సభ్యులతో బృందం స‌భ్యులు మాట్లాడారు. అనంతరం గుంటూరు అతిథి గృహంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించారు.

రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హాల్ దేర్ చెప్పారు. ర‌మ్య కుటుంబ సభ్యులు, వివిధ వర్గాల నుండి సమాచారాన్ని తీసుకున్నామ‌ని, రమ్య హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్న చెప్పారు. రమ్య కుటుంబానికి న్యాయం చేస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హాల్ దేర్ తెలిపారు.

మ‌రో ప‌క్క టీడీపీ, వైసీపీ నేత‌లు పోటాపోటీగా జాతీయ ఎస్సీ కమిషన్ బృందాన్ని క‌లిశారు. త‌మ త‌మ అభిప్రాయాల‌ను క‌మిష‌న్ ఎదుట వెల్ల‌డించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments