Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త చికెన్ తిన్నాడని భార్య కిరోసిన్ పోసుకుని నిప్పెట్టుకుంది.. ఎక్కడ?

భర్త చికెన్ తిన్నాడని భార్య కిరోసిన్ పోసుకుని నిప్పెట్టుకుంది.. ఎక్కడ?
, మంగళవారం, 24 ఆగస్టు 2021 (14:00 IST)
క్షణికావేశాలు కొంపముంచేస్తున్నాయి. తాజాగా ఓ వివాహిత భర్త చికెన్ తినేశాడని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్ సూరజ్​పుర్​లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరౌదా గ్రామానికి చెందిన రామ్​ జనమ్​ సింహ్ ఆగస్టు 22న రక్షాబంధన్​ సందర్భంగా తన బంధువుల ఇంటికి వెళ్లగా అక్కడ చికెన్​ తిన్నాడు. 
 
అయితే.. అది శ్రావణ మాసం చివరిరోజు. సాధారణంగా ప్రజలు శ్రావణ మాసంలో నాన్‌ వెజ్‌ తినకూడదనే నియమాలను పాటిస్తారు. మరికొందరిలో ఆ పట్టింపులు ఎక్కువగానే ఉంటాయి. సూరజ్‌పూర్‌లోని భట్గావ్ ప్రాంతంలోని కరోండ గ్రామానికి చెందిన మనీషా సింగ్ (19) ఆదివారం రక్షా బంధన్ రోజున తన భర్త రామజన్మతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది అక్కడి నుంచి ఇద్దరూ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. 
 
ఇంతలో, రామజన్మ పొరుగున ఉంటున్న తన అత్త ఇంటికిలో చికెన్‌ తినాలంటే వద్దని ఆమె వారించింది. అయినా రామ్‌జన్మ చికెన్‌ తిన్నాడు. శ్రావణ్‌ మాసం చివరి రోజు, రక్షాబంధన్ రోజున చికెన్ తినడం ద్వారా తాను పొరపాటు చేశానని మనీషా తన భర్తకు చెప్పింది.
 
దీని తరువాత, ఆమె కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయి ఇంటికి వెళ్లింది. కొంతసమయం తర్వాత రామజన్మ ఆమెకు నచ్చజెప్పడానికి ఇంటికి వెళ్లగా, అప్పటికే ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తన భార్యను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్ విమానం హైజాక్.. ఇరాన్‌కు దారి మళ్లింపు