Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 11న జాతీయ లోక్ అదాలత్!

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (16:09 IST)
కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదికని కృష్ణా జిల్లా జడ్జి  రామకృష్ణ చెప్పారు. కాలహరణం, ఆస్తి అన్యాక్రాంతం తదితర ముప్పులను సత్వరమే అధిగమించాలంటే, కక్షిదారులు రాజీ మార్గంలో అందరికి ఆమోదయోగ్యంగా కేసులను డిసెంబర్ 11న‌ జరిగే  జాతీయ లోక్ అదాలత్ పరిష్కరించుకోవాలని కృష్ణా జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గూడూరు రామకృష్ణ సూచించారు.
 
 
కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో జిల్లా జ‌డ్జి తన చాంబర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కోర్టు భవన సముదాయాలలో డిసెంబర్ 11న శ‌నివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించ నున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది కోవిడ్ కారణంగా కోర్టులు సరిగా జరగకపోవడంతో కేసుల సంఖ్య అధిక మయ్యాయన్నారు.

 
కృష్ణా జిల్లాలో మొత్తం 89 వేల 171 కేసులు ఉన్నాయని, వీటిలో తాము కనీసం 10 శాతం కేసులను పరిష్కరించే దిశలో తీవ్రంగా కృషి చేయనున్నట్లు జిల్లా జడ్జి ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్వర పరిష్కారం అవుతాయనే విషయాన్ని ప్రజలు తెలియజేసేందుకు న్యాయవాదులు లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు మరింత కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజారామ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments