Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ద్యావుడా, డాలర్ శేషాద్రి కుటుంబ సభ్యుల ఆత్మకు సంతాపం తెలిపిన ఉపముఖ్యమంత్రి

ద్యావుడా, డాలర్ శేషాద్రి కుటుంబ సభ్యుల ఆత్మకు సంతాపం తెలిపిన ఉపముఖ్యమంత్రి
, మంగళవారం, 30 నవంబరు 2021 (15:37 IST)
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడేస్తూ అడ్డంగా బుక్కవుతూ ఉంటారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. ఈసారి కూడా అదే పని చేశారు. తిరుమల ఓఎస్డీడీ డాలర్ శేషాద్రి పార్థీవ దేహానికి తిరుపతిలో నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి శేషాద్రి మరణంపై ఆవేదన వ్యక్తం చేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పాల్సింది పోయి కుటుంబ సభ్యుల ఆత్మకు సంతాపాన్ని తెలిపారు.

 
దీంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు షాకయ్యారు. సాధారణంగా అయితే చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని చెప్పాలని.. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపాలి. కానీ అంతా రివర్స్‌గా డిప్యూటీ సిఎం చెప్పడం అక్కడి వారిని నవ్వు తెప్పించింది. 

 
అయితే తప్పు చెప్పేసి మళ్ళీ దాన్ని సరిదిద్దుకునేందుకు నానా బాధలు  పడ్డారు నారాయణస్వామి. ఎక్కువగా మాట్లాడితే ఇంకా ఎన్ని తప్పులు వస్తాయేమోనని ఆలోచించి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు ఉపముఖ్యమంత్రి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో ఒక్క ఒమిక్రాన్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు : మంత్రి మాడవీయ