Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేట మొదలు.. తిరుపతిలో నారాయణ జూనియర్ కాలేజీ సీజ్

Webdunia
బుధవారం, 3 జులై 2019 (10:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో టీడీపీ నేతలకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా, టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులోభాగంగా, కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణంగా ఉన్న ప్రజావేదికను సీఎం జగన్ ఆదేశం మేరకు రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. 
 
అలాగే కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాల యజమానులకు కూడా సీఆర్డీయే నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. అలాగే, విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. మరో టీడీపీ నేతకు చెందిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేశారు. 
 
ఇపుడు మాజీ మంత్రి, నారాయణ గ్రూపు సంస్థల అధినేత పి. నారాయణకు చెందిన నారాయణ జూనియర్ కాలేజీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్ చేస్తున్నారు. ఇందులోభాగంగా, బుధవారం తిరుపతిలో నారాయణ జూనియర్ కాలేజీని సీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments