Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షుద్రపూజల కోసం నరబలి ఇచ్చారా..? అనంతలో కలకలం

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (21:53 IST)
అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. ఏపీలో మదనపల్లె తరహాలో అనంతపురంలో నరబలి ఇచ్చారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. బమ్మనహాల్‌ మండలం హెచ్‌ఎల్‌సి కాలువ వద్ద బుధవారం ఓ యువకుడిని క్షుద్రపూజలు చేసి హత్య చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఉంతకల్లు గ్రామ సమీపంలోని హెచ్‌ఎల్‌సి కాలువ గట్టుపై గుర్తు తెలియని 24 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. 
 
ఎస్‌ఐ బాషా తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడు మృతి చెందిన ప్రాంతంలో నిమ్మకాయలు, కుంకుమ, పసుపుతో వేసిన ముగ్గు, ఆకులు తదితర వాటిని గుర్తించారు. క్షుద్రపూజల అనంతరం యువకుడిని నరబలి ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన వ్యక్తి బళ్లారి ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. 
 
హత్య జరిగిన ప్రాంతంలో ఆనవాళ్లను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. క్షుద్రపూజల కోసమే యువకుడిని హత్య చేశారా..? లేక ఇతర కారణాలతో చంపి అనుమానం రాకుండా నిందితులు ఇలా చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments