Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇచ్ఛాపురం నుంచి నారా లోకేష్ పోటీ?

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (11:08 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులోభాగంగా, ఆయన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి ఇచ్ఛాపురం తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఒడిషా సరిహద్దుల్లో ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగితే ఐదు పర్యాయాలు తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైద్యుడు బెందాళం అశోక్‌ కుమార్ విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సీటును ముగ్గురు నేతలు ఆశిస్తున్నారు.
 
2014లో బెందాళం 20 వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపొందడంతో ఈ సారి కూడా అతడికే టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తామని పార్టీ శ్రేణులు ఉన్నాయి. కళింగ సామాజిక వర్గానికి చెందిన అశోక్‌ను కాదని.... కొత్త అభ్యర్థికి సీటు కేటాయిస్తే ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. 
 
ఇదే స్థానాన్ని రెడ్డి, యాదవ సామాజిక వర్గాలకు చెందిన నేతలతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఆశిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ను ఇక్కడి నుంచే పోటీ చేయించేందుకు ముఖ్య నేతలు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments