జగన్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్న దళితుడు (వీడియో)

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (13:49 IST)
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుడి కట్టి.. ఆయన తనయుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీకి ఓటు వేసినందుకు ఓ దళితుడు తన చెప్పుతో తానే కొట్టుకుంటున్నాడు. దీనికి సంబంధిచిన వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
ఈ వీడియోను ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాలనపై నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "జగన్ గారూ, మీ మాటలకు, చేతలకు ఆకాశానికి, భూమికి మధ్య ఉన్నంత దూరం ఉంది. మీరు అసెంబ్లీలో ఎస్సీ కార్పొరేషన్ బిల్ ప్రవేశపెట్టిన రోజే, మీ నాన్నగారికి గుడికట్టి, మీకు మద్దతిచ్చిన ఓ దళితుడికి ఎంతటి దుస్థితి పట్టిందో చూడండి" అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. 
 
తన నియోజకవర్గంలో పార్టీ కన్వీనర్ తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నాడని, పార్టీ నుంచి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ దళితుడు బూటుతో తనను తాను కొట్టుకోవడం ఆ వీడియోలో కనిపించింది.
 
మీ పార్టీకి మద్దతిచ్చినందుకు ఓ వ్యక్తి తనను తాను చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్న లోకేశ్, దీన్నిబట్టే మీ పాలన ఎంత చెత్తగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. దళితులపై వైసీపీ నాయకులు అకృత్యాలకు ఇదొక ఉదాహరణ వైఎస్ జగన్ గారూ అంటే లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొంటూ ఆ వీడియోను షేర్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments