Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తిరుపతికి వస్తున్న నారా భువనేశ్వరి

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (08:40 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం తిరుపతి పర్యటనకు వస్తున్నారు. ఇటీవల సంభవించిన తిరుపతి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించి, తగిన ఆర్థిక సాయం చేస్తారు. ఈ ఆర్థిక సాయం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున చేస్తారు. 
 
ఇటీవల తిరుపతిలో సంభవించిన వరదల్లో పదల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేస్తారు. మొత్తం 48 మందికి నారా భువనేశ్వరి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. 
 
ఇదిలావుంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అధికార వైకాపా మంత్రులతో పాటు టీడీపీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు కలిసి నారా భువనేశ్వరిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో వల్లభనేని వంశీ మీడియా ముఖ్యంగా నారా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం తర్వాత ఆమె తొలిసారి తిరుపతి పర్యటనకు వస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments