Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు నన్నపనేని రాజకుమారి ఎదురుచూపులు... ఎందుకబ్బా?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (13:43 IST)
ఎపీ నూతన ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులు వరుస కడుతున్నారు. కొత్త ప్రభుత్వంలో పనిచేయడానికి తాము ఆసక్తిగా ఉన్నట్టు జగన్ చెవిలో వాపోతున్నారు. 
 
ఇదిలాఉంటే తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఢీలా పడిపోవడం. సాక్షాత్తూ ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఓటమి చెందడంతో తమ రాజకీయ మనుగడ కోసం కొందరు తెలుగుదేశం నేతలు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ మరోమారు అధికారంలోకి రావడంతో అటువైపుగా కొందరు తెలుగుదేశం నేతలు చూస్తున్నట్టు సమాచారం. 
 
గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు పత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణతో రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయాన్ని పత్తిపాటి పుల్లారావు  ఖండించారు. ఇక ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తాడిపూడిలో క్యాంపు ఆఫీసులో జగన్‌ను కలవడానికి రావడంతో ఈ కలయికకు ప్రాధాన్యత సంతరిచుంకుంది.
 
ఐతే అప్పటికే జగన్ క్యాంపు ఆఫీసు నుంచి తమ ఇంటికి వెళ్లిపోవడంతో నన్నపనేని రాజకుమారి జగన్‌ను కలవకుండానే వెనుదిరిగారు. నన్నపనేని రాజకుమారి కుమార్తె నన్నపనేని సుధ 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా వినుకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి వై.సీ.పీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే నన్నపనేని రాజకుమారి కేవలం మర్యాదపూర్వకంగానే జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చారా? లేక మరేదైనా కారణమా అనే అంశాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments