జగన్ బాబాతో చాలా డేంజర్.. మంత్రి అచ్చెన్నాయుడు

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై ఆయన స్పందిస్తూ... జగన్ బాబాతో చాలా డేంజర్ అని నంద్యాల ఓటర్లు నిరూపించారని ఆయన వ్యాఖ్యానిం

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (13:57 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై ఆయన స్పందిస్తూ... జగన్ బాబాతో చాలా డేంజర్ అని నంద్యాల ఓటర్లు నిరూపించారని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం వెల్లడైన నంద్యాల ఉప ఎన్నిక ఫలితంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. 
 
దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు కులమతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారన్నారు. అందుకే నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లు ఏకపక్షంగా తీర్పునిచ్చారన్నారు. 
 
దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఇంతవరకు చూడని విధంగా ఒక ఉప ఎన్నిక ప్రచారం కోసం విపక్ష నేత, వైకాపా అధినేత జగన్ ఏకంగా 15 రోజుల పాటు నంద్యాలలో తిష్టవేసి, ప్రతి ఇంటింటికి వెళ్లివెళ్లి ఓట్లు వేయమని ప్రాధేయపడినా ఓటర్లు చాలా తెలివిగా, విజ్ఞతతో తీర్పునిచ్చారన్నారు. ఈ తీర్పుద్వారా జగన్ బాబాతో చాలా డేంజర్ అని నంద్యాల ఓటర్లు తేల్చారని అచ్చెన్నాయుడు కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments