Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదు.. నమిత

Webdunia
శనివారం, 10 జులై 2021 (13:33 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంపై సినీనటి నమిత అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నమిత మీడియాతో మాట్లాడారు. భక్తులకు టీటీడీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదని అన్నారు. టీటీడీలో ప్రస్తుతం పరిపాలన బాగోలేదని తెలిపారు. గతంలో ఉన్న అధికారి నేతృత్వంలో తిరుమలలో పరిపాలన బాగుందని చెప్పుకొచ్చారు. 
 
ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీటీడీ ఉద్యోగులంతా భయందోళనలో ఉన్నారని నమిత అన్నారు. మరోవైపు తాను నటించిన భౌభౌ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని... త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అలాగే నమిత థియేటర్ పేరుతో ఓటీటీ యాప్, నిర్మాణ సంస్థను ప్రారంభించామని నమిత వెల్లడించారు. 
 
థియేటర్లలో విడుదల చేయాలా ? వద్దా ? లేదా ఓటీటీలో చేయాలా అనేది నిర్ణయం తీసుకోలేదని… దానిపైనే సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. నమితా థియేటర్‌ పేరుతో ఓటీటీ… నమిత ప్రొడక్షన్స్‌ ప్రారంభిస్తున్నామని ఆమె వెల్లండిచారు. దీనిపై అతి త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు నమిత. 
 
కాగా… జెమిని, సింహా, బిల్లా లాంటి సినిమాల్లో నమిత… టాలీవుడ్‌ ప్రేక్షకులను నమిత అలరించింది. ఆ తర్వాత తెలుగు పరిశ్రమలో ఎక్కువగా ఛాన్స్‌‌లు రాక… తమిళ సినిమాలు చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments