Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చేపల కూర వండలేదని ఆ భర్త ఏం చేశాడో తెలుసా?

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (13:08 IST)
మద్యం మత్తులో ఉన్న ఓ భర్త తన భార్య చేప‌ల కూర వండ‌లేద‌ని అలిగి టవర్ ఎక్కాడు. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో గల లింగాల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడికి బ‌ల్మూర్‌కు చెందిన మ‌హిళ‌తో పెళ్ల‌య్యింది. అత‌డు ప‌ది రోజుల క్రింద‌ట అత్త‌గారి ఊరు అయిన బ‌ల్మూర్‌కు వ‌చ్చాడు. అక్క‌డ త‌న భార్య‌ను చేప‌ల కూర వండ‌మ‌ని అడిగాడు. 
 
సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన న‌రేష్ చేపల కూర వండ‌మ‌న్నా ఎందుకు వండ‌లేదంటూ భార్య‌తో గొడ‌వ ప‌డ్డాడు. భార్య చేప‌ల కూర వండేందుకు నిరాక‌రించ‌డంతో అత‌డు అలిగి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అక్క‌డ నుంచి మ‌ద్యం మ‌త్తులో సెల్ టవర్ ఎక్కాడు. 
 
విషయం తెలుసుకున్న ఎస్ఐ వీరబాబు అక్కడికి వెళ్లి కోమటికుంట సర్పంచ్ బచ్చన్నను కూడా అక్క‌డ‌కు పిలిపించాడు. స‌ర్పంచ్‌తో పాటు అక్క‌డున్న గ్రామపెద్ద‌లు అత‌డికి న‌చ్చ చెప్ప‌డంతో గంట‌న్న‌ర త‌ర్వాత అత‌డు ట‌వ‌ర్ దిగి రావ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments