Webdunia - Bharat's app for daily news and videos

Install App

తహసీల్దార్‌తో మాట్లాడతానని వెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (15:20 IST)
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహిళా తహసీల్దార్ విజయారెడ్డిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో విజయారెడ్డి తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఇకపోతే ఈ ఘటనలో గాయాలపాలైనవారిని చికిత్స నిమిత్తం ఆస్సత్రికి తరలించారు. 
 
సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు విజయారెడ్డితో మాట్లాడాలని ఓ వ్యక్తి ఆఫీసులోపలికి వెళ్లాడు. అరగంటపాటు చర్చించారు. అనంతరం ఒంటిపై మంటలతో విజయారెడ్డి బయటకు వచ్చారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ తీవ్రగాయాలపాలై ఆమె తహశీల్దార్ కార్యాలయంలోనే మృతిచెందారు.
 
కాగా అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం ఏర్పడిన తర్వాత విజయా రెడ్డి తొలి తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ఈ ఘటన భూవివాదమే కారణమై వుంటుందని పోలీసులు భావిస్తున్నారు. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటి.. నిందితుడు కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో నిందితుడు కూడా కాలిన గాయాలతో ఉండటంతో సమీపంలోని ఏదైనా ఆస్పత్రికి వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments