ఎంపీటీసీ - జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు - వైకాపా బోణీ

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (11:57 IST)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. నెల్లూరు జిల్లా కొవ్వూరులో తొలి ఫలితం వెలువడింది. ఆ ప్రాంతంలో వైసీపీ బోణీ కొట్టింది. ఆమంచర్ల ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి 760 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 
 
సౌత్‌ మోపూరు స్థానంలోనూ వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. కొవ్వూరులోని బ్రహ్మయ్య ఇంజనీరింగ్ కాలేజీలో కొవ్వూరు, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాలకు చెందిన ఓట్లు లెక్కిస్తున్నారు. సాయంత్రం 4 గంటలలోపు కౌంటింగ్‌ పూర్తి కానుంది. 
 
ఇత‌ర ప్రాంతాల్లోనూ ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. క‌రోనా నేపథ్యంలో ర్యాలీలు, విజయోత్సవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
 
అలాగే చిత్తూరు జిల్లాలో బుగ్గపట్నం ఎంపీటీసీ 1573 ఓట్లతో వైకాపా గెలుపు, పాతవెంకటాపురం ఎంపీటీసీ 616 ఓట్లతో వైకాపా గెలుపు. వైయస్ఆర్ జిల్లాలో ఊటుకూరు-2 ఎంపీటీసీ 882 ఓట్లతో వైకాపా గెలుపు. కృష్ణా జిల్లాలో అక్కపాలెం ఎంపీటీసీ 372 ఓట్లతో వైకాపా గెలుపు ప్రకాశం జిల్లాలో సంతమాగులూరు -1 ఎంపీటీసీ 1645 ఓట్లతో వైకాపా గెలుపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments