Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ లడ్డూకు భలే డిమాండ్ - గతం కంటే రూ.1.30 లక్షలు అధికం

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (10:47 IST)
హైదరాబాద్ నగరంలో బాలాపూర్ లడ్డూకు భలే గిరాకీ ఏర్పడింది. ఫలితంగా గత యేడాది కంటే ఈ లడ్డూ ధర రూ.1.30 లక్షలు అధికంగా పలికింది. కిందటేడాది కరోనా వైరస్ కారణంగా లడ్డూ వేలం పాటలు నిర్వహించలేదు. 2019లో రూ.17.60 లక్షల ధర పలుకగా, ఈ యేడాది ఈ లడ్డూ ధర రూ.18.90 లక్షలు పలికింది. 
 
తాజాగా జరిగిన వేలంపాటలో నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శశాంక్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ కడప ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలిసి బాలాపూర్‌ గణేశుని లడ్డూని దక్కించుకున్నారు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం చేసుకున్నారు. గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దయింది.
 
ఇరు రాష్ట్రాల ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ అన్నారు. శశాంక్‌ రెడ్డితో కలిసి లడ్డూని దక్కించుకున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి లడ్డూని కానుకగా అందిస్తామన్నారు. 
 
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కొలను రాంరెడ్డి హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments