బాలీవుడ్ లడ్డూకు భలే డిమాండ్ - గతం కంటే రూ.1.30 లక్షలు అధికం

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (10:47 IST)
హైదరాబాద్ నగరంలో బాలాపూర్ లడ్డూకు భలే గిరాకీ ఏర్పడింది. ఫలితంగా గత యేడాది కంటే ఈ లడ్డూ ధర రూ.1.30 లక్షలు అధికంగా పలికింది. కిందటేడాది కరోనా వైరస్ కారణంగా లడ్డూ వేలం పాటలు నిర్వహించలేదు. 2019లో రూ.17.60 లక్షల ధర పలుకగా, ఈ యేడాది ఈ లడ్డూ ధర రూ.18.90 లక్షలు పలికింది. 
 
తాజాగా జరిగిన వేలంపాటలో నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శశాంక్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ కడప ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలిసి బాలాపూర్‌ గణేశుని లడ్డూని దక్కించుకున్నారు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం చేసుకున్నారు. గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దయింది.
 
ఇరు రాష్ట్రాల ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ అన్నారు. శశాంక్‌ రెడ్డితో కలిసి లడ్డూని దక్కించుకున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి లడ్డూని కానుకగా అందిస్తామన్నారు. 
 
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కొలను రాంరెడ్డి హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments