Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంది? రామకృష్ణ

హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంది? రామకృష్ణ
విజయవాడ , గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:53 IST)
జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది పూర్తిగా అధికార పార్టీకి అనుకూలం అని వ్యాఖ్యానిస్తోంది. అధికార వైసీపీకి అనుకూలంగా ఉంద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ నుండి పోలింగ్ వరకు ఏకపక్షంగా సాగాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
 
అధికార వైయస్సార్ కాంగ్రెస్ దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలతో ఎన్నికల ప్రక్రియ గడిచింద‌ని, ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏకపక్షమే అని విమర్శించారు. పోలింగ్ కు ముందు కనీసం 4 వారాలు ఎన్నికల కోడ్ అమలులో ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతరు చేయలేద‌ని, ఈ ఎన్నికలను రద్దు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింద‌ని చెప్పారు. హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంద‌ని రామకృష్ణ ప్ర‌శ్నించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బట్టలు దొంగతనం చేసిన ఏఎస్ఐ మృతి... ఎలా?