Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమవరానికి రాని ఆర్ఆర్ఆర్ - రైలు దిగి వెనక్కి పయనం

Webdunia
సోమవారం, 4 జులై 2022 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం పర్యటించనున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా వస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఆయన ఈ కార్యక్రమానికి రాకుండానే వెనక్కి వెళ్ళారు. 
 
ప్రధాని మోడీ పర్యనటలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్న రఘురామ.. అక్కడ నుంచి భీమవరం వెళ్లేందుకు గత రాత్రి హైదరాబాద్ నగరంలో రైలు ఎక్కారు. ఈ క్రమంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. 
 
శనివారం ఆయనకు మద్దతుగా భీమవరంలో ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారన్నది సమాచారం. యువకుల తల్లిదండ్రులో ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. 
 
దీంతో మనస్తాపం చెందిన రఘురామ మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారు. ప్రొటోకాలో విషయంలో అధికారులు తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. యువకులపై కేసు పెట్టడం రఘురామను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. అందుకే భీమవరం రాకుండా ఆయన వెనక్కి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments