Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోత్కుపల్లికి కరోనా వైరస్ : పరిస్థితి విషమం

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (11:26 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మోత్కుపల్లి నరసింహులుకు క‌రోనా సోక‌డంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌, సోమాజిగూడ‌లోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. అయితే, నిన్న రాత్రి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఐసీయూకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అప్ప‌ట్లో టీడీపీ హయాంలో ఆయ‌న‌ మంత్రిగా పనిచేసిన విష‌యం తెలిసిందే. 2008లో ఆయ‌న‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
 
రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కొన్నేళ్లు టీడీపీలో కొన‌సాగిన ఆయ‌న అనంత‌రం ఆ పార్టీకి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసి హాట్ టాపిక్‌గా మారారు. దీంతో ఆయ‌న‌ను టీడీపీ అప్ప‌ట్లో పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. అనంత‌రం ఏపీలో టీడీపీ ఓడిపోవాల‌ని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బీజేపీలో చేరారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments