Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోత్కుపల్లికి కరోనా వైరస్ : పరిస్థితి విషమం

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (11:26 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మోత్కుపల్లి నరసింహులుకు క‌రోనా సోక‌డంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌, సోమాజిగూడ‌లోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. అయితే, నిన్న రాత్రి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఐసీయూకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అప్ప‌ట్లో టీడీపీ హయాంలో ఆయ‌న‌ మంత్రిగా పనిచేసిన విష‌యం తెలిసిందే. 2008లో ఆయ‌న‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
 
రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కొన్నేళ్లు టీడీపీలో కొన‌సాగిన ఆయ‌న అనంత‌రం ఆ పార్టీకి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసి హాట్ టాపిక్‌గా మారారు. దీంతో ఆయ‌న‌ను టీడీపీ అప్ప‌ట్లో పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. అనంత‌రం ఏపీలో టీడీపీ ఓడిపోవాల‌ని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బీజేపీలో చేరారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments