Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త లేడు.. సహజీవనం చేసింది.. పిల్లలకు ఉరేసింది.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (09:17 IST)
భర్త లేడు.. సహజీవనం చేసినా ఫలితం లేదు. అంతే ఏమనుకుందో ఏమో కానీ ఆ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరేసి హత్య చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆనంద్‌నగర్‌లో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అనూషకు ఒక కూతురు చిన్మయి(8), ఒక కుమారుడు మోహిత్‌(6) ఉన్నారు. 13 ఏండ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె తాడేపల్లి నుంచి రాజమండ్రి వచ్చి జీవిస్తోంది. 
 
అలాగే కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి ఆమె తన పిల్లకు ఉరివేసి చంపేసింది. అనంతరం ప్రియుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అరెస్టు చేశారు. చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
అయితే తన కుటుంబ పరిస్థితి బాగోలేదని, పిల్లలకు తిండిపెట్టలేక చంపేశానని అనూష చెబుతోంది. కానీ ఆమెకు ఆర్థిక ఇబ్బందులు లేవని, ఈ హత్యలకు వేరే కారణం ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనూష తరచూ పిల్లలను కొడుతుండేదని తెలిసింది. దాంతో ఆమె తల్లి కనకదుర్గ ఒకసారి ఆమెను మందలించగా అందుకు తల్లిపై కూడా అనూష దాడి చేసిందని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments