Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజమ్మ కంటతడి, అసలేమైంది?

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (18:26 IST)
సరిలేరు నాకెవ్వరు అనే విధంగా ఉంటారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. సినిమాలో రోజా మహానటి. రాజకీయాల్లో అయితే ఫైర్ బ్రాండ్. అయితే అలాంటి ఫైర్ బ్రాండ్ ఉన్నట్లుండి కంటతడి పెట్టారు. తనకు విలువ లేదంటూ ఆవేదన చెందారు.
 
ఎమ్మెల్యేలకు ఇచ్చే విలువ కూడా ఇవ్వడం లేదంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. వాదనలు విన్న అనంతరం వాక్ అవుట్ చేశారు. తిరుపతిలో ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి వచ్చారు రోజా. శాసనసభ్యులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్ళారు.
 
ముందుగా రోజా ఏడు నిమిషాల పాటు ప్రసంగించారు. అందులో ఐదు నిమిషాల పాటు ఏడుస్తూనే తన ఆవేదనను వెళ్లగక్కారట రోజా. తనకు ఎక్కడా ప్రోటోకాల్ ఇవ్వడం లేదన్నారట. టిటిడిలో కూడా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారట. ఎన్ని కమిటీలు వచ్చినా.. ఎంతమందికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదంటూ బోరున విలపించారట రోజా. ఇదంతా ప్రివిలేజ్ కమిటీ ముందు జరిగితే హడావిడిగా రోజా వెళ్ళిపోతూ కంటతడిపెట్టారు. 
 
ఐతే మీడియా ముందు అదేమీ లేదంటూ చెప్పారు. ఎర్రబారిన కళ్ళతో సరిగ్గా మాట్లాడలేని పరిస్థితుల్లో రోజా కనిపించారు. ఒక సీనియర్ ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా అని ప్రశ్నించారట. రోజా కన్నీంటి పర్యంతమవుతుండటంతో ప్రివిలేజ్ కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారట. దీనిపై కలెక్టర్‌తో కమిటీ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడడంతో పాటు మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారట. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments