Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ విశ్వవిఖ్యాత 'పప్పు' సార్వభౌమ... ఎమ్మెల్యే రోజా సెటైర్లు

వైఎస్సార్సీపి నగరి ఎమ్మెల్యే రోజా సమయం దొరికితే తెదేపాను తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటారు. తాజాగా ఆమె ఏపీ మంత్రి నారా లోకేష్ పైన చేశారు. నారా లోకేశ్‌ను 'విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌమ' అంటూ ఎద్దేవా చేశారు. ఏ పని జరగాలన్నా ఆయనకు సూట్‌కేసు ఇవ్వాల్సిందేననీ,

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (14:57 IST)
వైఎస్సార్సీపి నగరి ఎమ్మెల్యే రోజా సమయం దొరికితే తెదేపాను తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటారు. తాజాగా ఆమె ఏపీ మంత్రి నారా లోకేష్ పైన చేశారు. నారా లోకేశ్‌ను 'విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌమ' అంటూ ఎద్దేవా చేశారు. ఏ పని జరగాలన్నా ఆయనకు సూట్‌కేసు ఇవ్వాల్సిందేననీ, ఓటేసిన ప్రజలు ఆయన వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వెళితే పనులు జరగవని అన్నారు. 
 
నోట్ల కట్టలతో వున్న సంచి ఇస్తేనే సంతకాలు పెడతారంటూ విమర్శించారు. బుధవారం ఆమె పార్టీ వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన తెదేపా ఇప్పుడు యువతకు జాబులు లేక అల్లాడుతుంటే ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధైర్యముంటే ఇప్పటికిప్పుడు తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లో నిలబడాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా కోసం తెదేపా చేస్తున్నవన్నీ దిగజారుడు రాజకీయాలని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి 29 సార్లు వెళ్లారని తెదేపా అంటుంటుందనీ, ఐతే ఆయన వెళ్లింది మాత్రం ఓటుకు నోటు కేసు పరిష్కరించుకునేందుకే అంటూ ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments