Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గిపోతేనే ఫలితం ఉంటుంది.. చిరు చర్చలను స్వాగతించిన ఆర్కే రోజా

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (15:15 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు వ్యవహారం ఇపుడు తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమస్య పరిష్కారం కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా, ఆయన గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై సినీ సమస్యలపై చర్చించారు. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కావడం మంచి శుభపరిణామం అన్నారు. 
 
చిరంజీవిలా ఎవరైనా సరే సీఎంను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని తెలిపారు. అంతేకానీ రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడితే ఎవరికీ మేలు జరగదన్నారు. సమస్య పరిష్కారం కోసం సావధానంగా నడుచుకోవాలన్నారు. సినీ రంగం చెబుతున్న అన్ని అంశాల్లో న్యాయం ఉందనిపిస్తే మాత్రం సీఎం జగన్ తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 
 
అయితే, రాష్ట్రంలోని విపక్షసభ్యులు ప్రతి అంశాన్ని రాద్దాంతం చేస్తూ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఏపీలో ఇపుడు రాజకీయం చేసేందుకు ఎలాంటి సమస్యా లేకపోవడంతో సినిమా టిక్కెట్ ధరలపై రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments