Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి గౌతం రెడ్డి మరణం వైకాపాకు తీరని లోటు : ఎమ్మెల్యే రోజా

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:57 IST)
ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మృతి వైకాపాకు తీరని లోటని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సినీ నటి ఆర్.కె.రోజా అన్నారు. సోమవారం గౌతం రెడ్డికి తీవ్రమైన గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఆయన మృతిపట్ల ఆర్.కె.రోజా స్పందించారు. గౌతం రెడ్డి ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిసివేసిందన్నారు. గౌతం రెడ్డి తనకు సోదరుడు వంటివారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. 
 
ఉన్నత విద్యను అభ్యసించిన గౌతం రెడ్డి.. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే స్వభావం కలిగిన వారని చెప్పారు. ఆయన మరణం వైకాపాకు తీరని లోటని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గౌతం రెడ్డిలు మంచి స్నేహితులని గుర్తుచేశారు.
 
కాగా, కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత చాలా మంది గుండెపోటుకుగురై మృత్యువాతపడుతున్నారని చెప్పారు. గౌతంరెడ్డితో చివరిసారిగా 20 రోజుల క్రితం తాను మాట్లాడినట్టు చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఆమె చెప్పారు. 
Koo App

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments