Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకపాటి గౌతంరెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:48 IST)
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. సోమవారం ఆయనకు గుండెపోటురావడంతో ఆగమేఘాలపై హైదరాబాద్‌కు తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్టు అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దీంతో సోమవారం సాయంత్రం వరకు ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అభిమానులు, రాజకీయ నేతల సందర్శనార్థం ఉంచుతారు. 
 
దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లి గౌతంరెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. గౌతం రెడ్డి మృతి తనను కలిచివేసిందని, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి గౌతం రెడ్డి మృతి బాధాకరమని ఆయన చెప్పారు. అలాగే, గౌతం రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments