ఎవడో కొన్‌కిస్కా వస్తే వంగి వంగి 100 లడ్లు ఇస్తారు... జేఈవోపై రోజా ఫైర్(వీడియో)

గాలేరు-నగరి ప్రాజెక్టు సాధన కోసం 88 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన నగరి ఎమ్మెల్యే రోజా శనివారం నాడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ... తమ పట్ల తితిదే జేఈవో ప్రవర్తించిన తీరు అమానుషమన్నారు. ప్రజా సేవకులమైన తమకు ఎల్

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (17:40 IST)
గాలేరు-నగరి ప్రాజెక్టు సాధన కోసం 88 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన నగరి ఎమ్మెల్యే రోజా శనివారం నాడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ... తమ పట్ల తితిదే జేఈవో ప్రవర్తించిన తీరు అమానుషమన్నారు. ప్రజా సేవకులమైన తమకు ఎల్ 1, ఎల్ 2లో దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వమంటే ఇవ్వలేదని మండిపడ్డారు. 
 
"అడ్డమైనవాళ్లకి ఎల్ 1 టిక్కెట్లిస్తున్నారు. తనతో వచ్చినవారికి పనులున్నాయి, వ్యాపారాలున్నాయి. తామంతా ప్రజల కోసం పోరాడుతున్నాం. తిరుమల దర్శనం విషయంలో జేఈవో ఉత్తరాది వారికి ప్రాముఖ్యత ఇస్తుంటారు. సూట్‌కేసులు అందుకుంటున్నారు. దేవుడి దగ్గర మాట్లాడకూడదనుకున్నాను. ఎవడో కొన్‌కిస్కా వస్తే వంగి వంగి 100 లడ్లు ఇచ్చి ఎన్నో మర్యాదలు చేసి పంపిస్తారు. కానీ పేదవారిని సెకను కూడా తిరుమల వెంకన్నను చూడనివ్వరు. 
 
ఏడేళ్లుగా అతడే జేఈవోగా ఎలా వున్నారు. ఈవోగా సాంబశివరావు వున్నంతకాలం తోక ముడుచుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఉత్తరాది వ్యక్తి ఈవోగా రావడంతో మొత్తం అధికారాన్ని ఇతని చేతిలో పెట్టుకున్నాడు. పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత వారిపై వుంది. తితిదే బోర్డును కూడా వేయనియ్యకుండా తిష్టవేసి కూర్చున్నాడు. ఆయన అసలు సంగతి ఏమిటో సమాచార చట్టం కింద మొత్తం బయటకు లాగుతా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments