Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా, సెల్వమణికి సన్మానం చేశారు, ఎందుకంటే?

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (17:31 IST)
అనుకున్నది సాధించారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. తన సొంత నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలలో ఇబ్బందులు తప్పవని ఆమె భావించారు. తాను నిలబెట్టిన మున్సిపల్ కౌన్సిలర్లను ఎక్కడ రెబల్ అభ్యర్థులు ఓడించేస్తారేమోనన్న భయంలో ఉన్నారు రోజా. 
 
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్షానికి ఊపిరి పీల్చుకోనివ్వకుండా భారీ మెజారిటీతో అభ్యర్థులను గెలిపించుకోవడం.. అందులోను రెబల్స్‌ను చిత్తు చేశారు రోజా. ఒకే ఒక్క రెబల్ అభ్యర్థి నగరిలో గెలుపొందాడు.
 
అంతేతప్ప రెండు మున్సిపాలిటీలను వైసిపినే కైవసం చేసుకుంది. దగ్గరుండి కొత్త కౌన్సిలర్ల చేత ప్రమాణస్వీకారం చేయించారు రోజా. ఎంతో సంతోషంతో కార్యకర్తలందరినీ పలుకరిస్తూ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజా. ఈ సంధర్భంగా రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణిని ఘనంగా సన్మానించారు వైసిపి కార్యకర్తలు, నాయకులు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments