Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన గాలివాటం పార్టీ అని ఎక్కడా అనలేదు : ఎమ్మెల్యే రాపాక

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (19:58 IST)
జనసేన పార్టీ ఓ గాలివాటం పార్టీ అని, అది గాలికిపోయే పార్టీ అని తాను ఎక్కడా అనలేదని ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని కొందరు కావాలనే వక్రీకరించి వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. తనను జనసేన నుంచి సస్పెండ్ చేసినట్టు ఫేక్ న్యూస్ కూడా వస్తున్నాయని వెల్లడించారు.
 
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక కావడం గమనార్హం. ఈయన రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. రాపాక వరప్రసాద్ రూపంలో ఆ పార్టీకి అసెంబ్లీలో ఓ ప్రతినిధి లభించాడు. కానీ, వరప్రసాద్ సాంకేతికంగా జనసేన ఎమ్మెల్యేనే అయినా, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పైగా, జనసేన హైకమాండ్‌తో ఆయన సఖ్యత అంతంతమాత్రమే! ఈ నేపథ్యంలో రాపాక జనసేన ఓ గాలి పార్టీ అన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు.
 
జనసేన గాలికి వెళ్లిపోయే పార్టీ అని గానీ, గాలి పార్టీ అని గానీ ఎక్కడా అనలేదని స్పష్టం చేశారు. అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటేనే పనులు జరుగుతాయన్నారు. ఎన్నికల ముందు చివరి నిమిషం వరకు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించానని, కానీ బొంతు రాజేశ్వరరావు వల్ల తనకు టికెట్ దూరమైందని రాపాక వెల్లడించారు.
 
పైగా, తాను కేవలం జనసైనికుల వల్లే గెలవలేదని, జనసైనికుల ప్రభావం ఉండుంటే రాష్ట్రం మొత్తం జనసేన గెలిచుండేదని సూత్రీకరించారు. తనకు జనసైనికులతో పాటు మిగతవాళ్లు కూడా ఓట్లు వేశారని, వారికి కూడా తాను సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలన్నా, ప్రజలకు మంచి చేయాలన్నా ఖచ్చితంగా తాను అధికార వైకాపాకు వంతపాట పాడక తప్పదని ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments