Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ అంతుచిక్కని వ్యాధి సంగతేంటో చూడండి: సీయం జగన్ ఆదేశం

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (13:25 IST)
పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళలో అంతుచిక్కని వ్యాధి అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలపై హుటాహుటిన ఏలూరు బయలుదేరి వెళ్లారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కె.భాస్కర్ కూడా వెళ్లినవారిలో వున్నారు.
 
పూళ్ళలో అంతుచిక్కని వ్యాధికి సంబంధించి శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సియం ఆయా  అధికారులతో సమీక్షించారు. వెంటనే వెళ్ళి పరిస్థితిని పరిశీలించాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్‌ను సియం ఆదేశించడంతో సిఎస్ ఇతర అధికారులు హుటాహుటిన ఏలూరు బయలుదేరి వెళ్ళారు.
 
ఈ అంశానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం పూర్తి అప్రమత్తం చేయడంతో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోంది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ కమీషనర్లు ఏలూరు పూళ్ళ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments