Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైత్ర నిందితుడు రాజు ఆత్మహత్య...రైలు ప‌ట్టాల‌పై మృత‌దేహం!

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (11:21 IST)
గ‌త వారం రోజులుగా తెలంగాణా పోలీసులు వెతుకుతున్న హ‌త్యాచార నిందితుడు రాజు చివ‌రికి రైలు ప‌ట్టాల‌పై శ‌వ‌మై తేలాడు. సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృత దేహం కనిపించింది.  చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించారు. సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు. గత 8 రోజులుగా రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
చిన్నారిపై అమానుషంగా హ‌త్యాచారం చేసిన రాజు క‌నిపిస్తే, ఆచూకీ అందిస్తే, 10 ల‌క్ష‌ల రూపాయ‌ల బ‌హుమ‌తిని కూడా తెలంగాణా పోలీసులు ప్ర‌కటించారు. మరో ప‌క్క రాజుని ఎన్ కౌంట‌ర్ చేయాల‌ని ప్ర‌జా సంఘాలు, చిన్నారి బంధువులు డిమాండు చేసారు. ఈ ద‌శ‌లో రాజు ప్రాణాల‌తో దొరికి ఉంటే, పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యేది. కానీ, నిందితుడు రైలు ప‌ట్టాల‌పై శవ‌మై క‌నిపించ‌డంతో పోలీసులు ఆత్మ‌హ‌త్య‌ కేసు న‌మోదు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments