Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధువే రాబందువు... బాలికపై నాలుగేళ్లుగా రేప్.. వీడియో తీసి స్నేహితులకు షేర్

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (11:54 IST)
ఓ బాలిక పాలిట బంధువే రాబందువయ్యాడు. అన్నెంపుణ్యం తెలియని ఓ బాలికను చెరబట్టిమరీ రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. అంతేనా, అత్యాచారాన్ని వీడియో తీసి తన స్నేహితులకు కూడా షేర్ చేశాడు. దాన్ని బూచిగా చూపి గత నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. హైదరాబాద్ కామాటిపురలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
కామాటిపురకు చెందిన ఓ వ్యక్తి ఆయిల్ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈయనకు భార్యా, ఓ కుమార్తె ఉంది. పొట్టకూటి కోసం భార్యాభర్తలు పనులకు వెళితే, బాలిక ఒక్కటే ఇంట్లో ఉండేది. దీన్ని గమనించిన సమీప బంధువు రాజేశ్ (25) ఆ బాలికను చెరబట్టాడు. ఆ తర్వాత ఆ బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను చూపిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అంతటితో ఆగని ఆ కామాంధుడు ఆ వీడియోను తన స్నేహితులకు చేరవేశాడు. అలా ఈ వీడియో పలువురుకి షేర్ అయింది. ఈ విషయాన్ని ఆ బాలికకు చెందిన రాజేశ్ స్నేహితులు అభిజిత్ కౌశిక్, శుభమ్ వ్యాస్‌లతో పాటు మొత్తం 8 మంది ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఆ బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... డిసెంబరు 31వ తేదీన రాజేశ్‌తో పాటు ముగ్గురుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments