Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచారం..

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (18:05 IST)
చిత్తూరు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. లిఫ్టు పేరుతో ఓ బాలికను ఎక్కించుకున్న ఇద్దరు యువకులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపారు. ఈ దారుణం గత నెల 24వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా ముళ్లపూడిలో తల్లిదండ్రులపై కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసిన బాధితురాలు.. తిరుపతి నుంచి తిరుచానూరు వెళ్లడానికి వెంకటేశ్ అనే యువకుడిని లిప్ట్ అడిగింది. బండిపై తీసుకు వెళ్లిన అతను తిరుచానూరు దాటేసి ముళ్లపూడి దగ్గర బండి నిలిపాడు. 
 
తిరుచానూరు దాటిపోయిన విషయాన్ని ఆ అమ్మాయి తెలుసుకోలేకపోయింది. బండిలో పెట్రోల్ అయిపోయిందని చెప్పేసరికి.. నిజమేనని అనుకుంది. తన స్నేహితుడికి ఫోన్ చేసి పెట్రోల్ తీసుకురమ్మంటానని చెప్పేసరికి.. నిజమేనని భ్రమించింది. అయితే వెంటనే తన స్నేహితుడు రాజ్ మోహన్ నాయక్‌కు ఫోన్ చేసిన వెంకటేశ్.. అక్కడికి రప్పించాడు. 
 
ఇద్దరూ ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు. స్థానికుల సమాచారంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని.. తల్లిదండ్రులకు అప్పగించారని తెలిపారు. నిందితుల్లో ఒకరైన రాజ్ మోహన్ నాయక్‌పై గతంలో ఓ మర్డర్ కేసుతో పాటు రౌడీ షీటర్ తెరిచారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments