Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రాజకీయ భిక్ష మీరు పెట్టిదంటూ.. బోరున విలపించిన ఏపీ ఆరోగ్య మంత్రి రజనీ

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (17:01 IST)
ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంమత్రి విడదల రజనీ బోరున విలపించారు. వెక్కివెక్కి ఏడ్చారు. ఈ రాజకీయ భిక్ష మీరు పెట్టిందంటూ ఆమె విలపించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో దిక్కులు పిక్కటిల్లేనా ఏపీ సీఎం జగన్ గెలుపు ఉండబోతుందని ఆమె జోస్యం చెప్పారు. 
 
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం చేతుల మీదుగా ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ, చంద్రబాబు హయాంలో వైద్య రంగానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
జగన్ వంటి ఒక నేతకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఏం చేయొచ్చే గత నాలుగేళ్ల కాలంలో చేసి చూపించారని చెప్పారు. దుష్టచతుష్టయం ఎన్ని పన్నాగాలు పన్నినా భూమి చీలినా, నింగి కుంగినా, అన్యాయానికి ఓటమి తప్పదన్నారు. బాబుకు, టీడీపీకి ఓటమి తప్పదన్నారు. జగనన్న గెలుపు తథ్యమన్నారు. 
 
ఒక సాధారణ మహిళనైన తనకు ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం ఇచ్చిన జగనన్నకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తన రాజకీయ జీవితం, తన పదవులు, రాజకీయ భవిష్యత్ మీరు పెట్టిన భిక్షేనటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, రజనీ కంటతడి పెట్టారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య రంగంలో చరిత్ర సృష్టించారని, మళ్లీ ఇపుడు సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానంతో నవశకం లిఖించనున్నారని ఆమె పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments