Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ షోలో బావమరుదులు అన్‌స్టాపబుల్‌గా అబద్ధాలు చెప్పారు... మంత్రి రోజా

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (17:32 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అతిధిగా పాల్గొన్న బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' షో పై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం మీడియాతో మంత్రి రోజా మాట్లాడుతూ.. 'అన్‌స్టాపబుల్' షోలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ అబద్ధాలు చెప్పారని అన్నారు. 
 
అధికార దాహంతో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ మరణానికి కారణమయ్యారని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ పాదాలు తాకి ఏడ్చేశానంటూ చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ ఫొటోలను చంద్రబాబు నాయుడు విసిరేశారని మంత్రి రోజా చెప్పారు.
 
ఆ షోలో బావమరుదులు అన్‌స్టాపబుల్‌గా అబద్ధాలు చెప్పారని వ్యంగ్యంగా అన్నారు రోజా. పచ్చమీడియా ద్వారా చెబితే ప్రజలు నమ్మడంలేదు కాబట్టి, వేరే ఎంటర్‌టైన్‌మెంట్ వేదిక ద్వారా చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇవన్నీ నమ్మడానికి ప్రజలేమీ పిచ్చివాళ్లు కాదని, వీళ్లు తింగరోళ్లు అనుకుంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. 
 
ఒక ప్రోమో వస్తేనే ఎన్ని వివాదాలు వచ్చాయో అందరికీ తెలిసిందేనని, ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవం అని చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని రోజా విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments