Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ షోలో బావమరుదులు అన్‌స్టాపబుల్‌గా అబద్ధాలు చెప్పారు... మంత్రి రోజా

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (17:32 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అతిధిగా పాల్గొన్న బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' షో పై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం మీడియాతో మంత్రి రోజా మాట్లాడుతూ.. 'అన్‌స్టాపబుల్' షోలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ అబద్ధాలు చెప్పారని అన్నారు. 
 
అధికార దాహంతో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ మరణానికి కారణమయ్యారని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ పాదాలు తాకి ఏడ్చేశానంటూ చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ ఫొటోలను చంద్రబాబు నాయుడు విసిరేశారని మంత్రి రోజా చెప్పారు.
 
ఆ షోలో బావమరుదులు అన్‌స్టాపబుల్‌గా అబద్ధాలు చెప్పారని వ్యంగ్యంగా అన్నారు రోజా. పచ్చమీడియా ద్వారా చెబితే ప్రజలు నమ్మడంలేదు కాబట్టి, వేరే ఎంటర్‌టైన్‌మెంట్ వేదిక ద్వారా చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇవన్నీ నమ్మడానికి ప్రజలేమీ పిచ్చివాళ్లు కాదని, వీళ్లు తింగరోళ్లు అనుకుంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. 
 
ఒక ప్రోమో వస్తేనే ఎన్ని వివాదాలు వచ్చాయో అందరికీ తెలిసిందేనని, ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవం అని చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని రోజా విమర్శించారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments