Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా బిజీ.. అందుకే దావోస్ వెళ్లలేదు : మంత్రి గుడివాడ అమర్నాథ్

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (09:41 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షణం తీరిక లేకుండా చాలా బిజీగా ఉన్నారని అందుకే దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరుకాలేక పోయారని ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ సదస్సుకు ఏపీ ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఈ వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదన్నారు. అదంతా దుష్ప్రచారమే అని చెప్పారు. 
 
మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకావాలంటూ గత యేడాది నవంబరు 25వ తేదీన సీఎంకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానాలు అందాయని తెలిపారు. 
 
అయితే, వచ్చే మార్చి నెలలో విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సును నిర్వహించనున్నామని, ఈ సందస్సుకు ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించాలని సీఎం జగన్ నిర్ణయించారని, ఆ పనుల్లో ఆయన తలమునకలై ఉన్నారని తెలిపారు. 
 
గతంలో దావోస్ వెళ్లాలని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడైనా అక్కడి నిర్వాహకులను ఆహ్వానించారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో యేడాదికి రూ.11 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, జగన్ పాలనలో యేడాదికి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి గుడివాడ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments