గత చంద్రబాబు సర్కారు వల్లే పోలవరం పూర్తికాలేదు : మంత్రి అనిల్ కుమార్

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (08:53 IST)
పోలవరం ప్రాజెక్టును తాము అనుకున్న సమయానికి పూర్తిచేయలేక పోవడానికి ప్రధాన కారణం గత చంద్రబాబు ప్రభుత్వమేనని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 2021 డిసెంబరు ఒకటో తేదీ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఆయన అసెంబ్లీ వేదికగా సాక్షిగా ప్రకటించారు. కానీ, డిసెంబరు ఒకటో తేదీ వెళ్లిపోయింది. దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. 
 
వీటిపై అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, 2021 డిసెంబరు ఒకటో తేదీ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని గతంలో చెప్పిన మాట నిజమేనన్నారు. అయితే, గత తెదేపా ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయామని ఆయన చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. గత ప్రభుత్వం స్పిల్ వే, కాఫర్ డ్యామ్ నిర్మాణాలను ఒకేసారి చేపట్టిందని, అదీ కూడా సగం మాత్రమే పూర్తి చేసిందని చెప్పారు. 
 
అయితే, గత యేడాది సంభవించిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్, దిగువన ఉన్న కాఫర్ డ్యామ్ కూడా బాగా దెబ్బతిందన్నారు. రెండు కిలోమీటర్ల నదిలో పోవాల్సిన వరదను మార్చి పంపడంతోనే డ్యామ్ దెబ్బతిన్నదని వివరించారు. అలాగే, ఇతర సాంకేతిక అంశాల కారణంగా కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేక పోయామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments