అర్థరాత్రి హైడ్రామా : టీడీపీ నేత దేవినేని అరెస్టు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (08:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం అర్థరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వెంటనే ఠాణాకు తరలించారు. 
 
తనపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ దేవినేని ఉమా ఇతర నేతలతో కలిసి జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు ఆరుగంటల పాటు దేవినేని ఉమా తన కారులో కూర్చొని ఆందోళన చేపట్టారు. 
 
దీంతో అర్ధరాత్రి తర్వాత వాహనం అద్దాలు తొలగించి దేవినేనిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం తమ వాహనంలో దేవినేనిని ఎక్కించుకొని స్టేషన్‌కు తరలించారు.   
 
కాగా, మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై వైకాపా వర్గీయులు మంగళవారం రాళ్లదాడికి దిగారు. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద  వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. 
 
వాహనం చుట్టుముట్టి దాడికి దిగారు. మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ అనుచరులే దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ దేవినేని ఉమా జి.కొండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. 
 
ఈ ఘటనపై రాష్ట్ర డీఐజీ మోహన్ రావు స్పందించారు. దేవినేని ఉమా ఉద్దేశ పూర్వకంగా జి.కొండూరులో అలజడి సృష్టించారని ఆరోపించారు. దేవినేని ఉమా చర్యలపై ఫిర్యాదు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఉమాను అరెస్ట్‌ చేశామని, వంద శాతం పారదర్శకంగా విచారిస్తామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ అన్నారు. ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments