Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రాష్ట్రంలో నరమాంస భక్షకులు ... పది మందిపై కేసు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (08:05 IST)
ఇటీవలి కాలంలో మంచితనం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. మనుషులను మనుషులే చంపేస్తున్నారు. చిన్నపాటి విషయానికి కూడా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాశిలో నరమాంస భక్షకుల వ్యవహారం కలకలం రేగింది. ఈ జిల్లాలో కొందరు మాంత్రికులు పుర్రెతో నృత్యాలు చేసిన వీడియో కలకలం రేపుతోంది. వారంతా నరమాంసం తిన్నారన్న అభియోగంపై పోలీసులు 10 మందిపై కేసులు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెన్‌కాశిలోని కల్లురాణి గ్రామంలో జరిగిన ఓ వేడుకలో ఈ పుర్రెలకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది వైరల్‌ అయింది. దీంతో ఆ గ్రామ పాలనాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అనంతరం కట్టు కోవిల గుడిలో ఎవరి మృతదేహాన్ని భక్షించారో తెలుసుకొనేందుకు కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని ఎప్పుడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశంపై పోలీసులకు ఇంకా ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు.
 
ఆ సమయంలో మాంత్రికులు మత్తులో ఉన్నారని, ఆ గ్రామ దేవత వారిని ఆవహించిందని పేర్కొంటున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, సగం కాలిన మృతదేహాన్ని ఏదైనా గ్రామంలోని శ్మశానవాటిక నుంచి  తీసుకొచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2019లో కూడా ఇదే గ్రామంలో కొందరు వ్యక్తులు మనిషి పుర్రెను తీసుకొచ్చి ఇదే తరహాలో ప్రదర్శించినట్టు పోలీసులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments