ఏపీ సీఎంపై మేకపాటి సంచలన వ్యాఖ్యలు.. అలాంటి నాయకుడు ఉండకూడదు..

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (17:20 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మేకపాటి రాజమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తలేనని.. కానీ సొంత దారులం కాదని మేకపాటి వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును ప్రజలకే అప్పగించాలని సూచించిన ఆయన.. ప్రజలకు విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు ఇలా అన్ని కార్యక్రమాలు చేయాలన్నారు.
 
అసలే, రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయిందని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే.. బాగా పనిచేయాలని గౌతమ్‌రెడ్డికి సూచించానని గుర్తు చేశారు. ఏపీని హైదరాబాద్‌ తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. కానీ, ప్రతి దాంట్లో స్వార్థం ఉండకూడదన్నారు మేకపాటి రాజమోహన్‌రెడ్డి.
 
ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారని.. ఈ స్వల్ప కాలంలో వేలకోట్లు సంపాదించి ఏం ఉపయోగం.. తగలేసుకోవడానికా? అని మేకపాటి ప్రశ్నించారు. వైఎస్ జగన్‌ను చూస్తే మంచి నాయకత్వ లక్షణాలు వున్నాయని అనిపించేది.. వైఎస్సార్ లేని లోటు తీరుస్తానని చెప్పాను.  
 
అందుకే గత ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పానని.. అయితే, ప్రజల అభిమానం పొందాలి.. కానీ, వారిని చీట్‌ చేయొద్దు.. మభ్య పెట్టడం చేయకూడదు.. అలాంటి నాయకుడు ఉండకూడదంటూ హాట్‌ కామెంట్లు చేశారు మేకపాటి. ప్రస్తుతం మేకపాటి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైనాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments