Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయగిరి మెరిట్స్ కాలేజీలో మంత్రి గౌతం రెడ్డి అంత్యక్రియలు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (07:47 IST)
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. అయితే, ఈ అంత్యక్రియలను తొలుత ఆయన స్వగ్రామైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించాలని భావించారు. కానీ, ఉదయగిరిలోని మెరిట్స్ కాలేజీ ప్రాంగణంలో వీటిని నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయాన్ని గౌతం రెడ్డి అంత్యక్రియల నిర్వహణ సమన్వయకర్తగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించిన ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, సోమవారం ఉదయం కన్నుమూసిన గౌతం రెడ్డి పార్ధిదేహాన్ని మంగళవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్ ద్వారా తొలుత నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో ఉన్న మంత్రి గౌతం రెడ్డి నివాసానికి తరలిస్తారు. 
 
ఇక్కడే ప్రజలు, మేకపాటి అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచుంతారు. అదేసమయంలో అమెరికాలో ఉన్న గౌతం రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి మంగళవారం సాయంత్రానికి నెల్లూరుకు చేరుకుంటారు. ఆ తర్వాత అంటే మరుసటి రోజున ఉదయగిరిలోని మెరిట్స్ కాలేజీ ప్రాంగణంలో మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments