Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయగిరి మెరిట్స్ కాలేజీలో మంత్రి గౌతం రెడ్డి అంత్యక్రియలు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (07:47 IST)
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. అయితే, ఈ అంత్యక్రియలను తొలుత ఆయన స్వగ్రామైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించాలని భావించారు. కానీ, ఉదయగిరిలోని మెరిట్స్ కాలేజీ ప్రాంగణంలో వీటిని నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయాన్ని గౌతం రెడ్డి అంత్యక్రియల నిర్వహణ సమన్వయకర్తగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించిన ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, సోమవారం ఉదయం కన్నుమూసిన గౌతం రెడ్డి పార్ధిదేహాన్ని మంగళవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్ ద్వారా తొలుత నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో ఉన్న మంత్రి గౌతం రెడ్డి నివాసానికి తరలిస్తారు. 
 
ఇక్కడే ప్రజలు, మేకపాటి అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచుంతారు. అదేసమయంలో అమెరికాలో ఉన్న గౌతం రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి మంగళవారం సాయంత్రానికి నెల్లూరుకు చేరుకుంటారు. ఆ తర్వాత అంటే మరుసటి రోజున ఉదయగిరిలోని మెరిట్స్ కాలేజీ ప్రాంగణంలో మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments