Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రి ఆలయానికి మేఘా 6 కేజీల బంగారం విరాళం

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (09:38 IST)
యాదాద్రి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. వ్యాపార వేత్తలు, ప్రముఖులు ముందుకు వచ్చి కిలోల కొద్దీ బంగారాన్ని ఇస్తున్నారు. విరాళాలు ప్రకటించడంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌తో సన్నిహితంగా ఉండే కాంట్రాక్టు, కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు పోటీ పడుతున్నాయి. 
 
కాళేశ్వరం సహా అనేక కీలక ప్రాజెక్టులు నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ సంస్థ 6 కేజీల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ పుణ్యకార్యంలో పాలుపంచుకోవడం తమకు ఎంతో గౌరవప్రదమని సంస్థ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని తెలిపారు. 
 
అలాగే, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు, రోడ్లు, హైవేల పనులు చేస్తున్న కేఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌ ఎండీ కామిడి నర్సింహారెడ్డి 2 కేజీల బంగారం విరాళంగా ప్రకటించారు. ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగే ప్రణీత్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఎండీ నరేంద్ర కుమార్‌‌‌‌‌‌‌‌ కామరాజు 2 కిలోల బంగారం ఇస్తామని పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, జలవిహార్‌‌‌‌‌‌‌‌ ఎండీ ఎన్‌‌‌‌‌‌‌‌వీ రామరాజు కిలో బంగారం ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, విరాళాల సేకరణ కోసం యాదాద్రి ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను తీసుకొచ్చారు. దీన్ని బుధవారం టెంపుల్ ఈవో గీతారెడ్డి విడుదల చేశారు. ప్రజలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసేందుకు వీలుగా అకౌంట్ నంబర్ తో పాటు ఐఎఫ్ఎస్సీ కోడ్ ను రిలీజ్ చేశారు. యాదగిరిగుట్టలోని ఇండియన్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ నంబర్ 6814884695, ఐఎఫ్ఎస్సీ కోడ్ IDIB000Y011ను అందుబాటులోకి తెచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments